చెన్నై : తిరుత్తణి సమీపం కనకమ్మసత్రం తిరువలంగాడు కూడలి రోడ్డులోని ద్విచక్ర వాహన షోరూమ్లో హిజ్రాలు చోరీకి పాల్పడ్డారు. తిరువలంగాడు కూడలి రోడ్డులో ద్విచక్ర వాహన షోరూమ్ వుంది. అందులో అదే ప్రాంతానికి చెందిన కలైవాణి అనే మహిళ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం షోరూమ్కు వచ్చిన ఇద్దరు హిజ్రాలు కలైమామణికి దిష్టి తీస్తామని చెప్పి షోరూమ్ ముందుకు తీసుకురాగా, మరో హిజ్రా ఆ గదిలో డ్రాలో వున్న రూ.50 వేలు దోచుకున్నారు. అనంతరం దిష్టి తీసిన వారు వచ్చిన స్కూటీలో వెళ్లిపోయారు. లోనికి వెళ్లిన కలైమామణి తన రూమ్లోని డ్రాలో వున్న రూ.50 వేలు చోరీకి గురైన విషయం గుర్తించి వెంటనే కనకమ్మసత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని షోరూమ్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm