అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్బాబుపై వైసీపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గణేష్బాబును ఆక్టోపస్కు బదిలీ చేసింది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ సామగ్రి మాజీ స్పీకర్ కోడెల నివాసానికి తరలించడం వెనుక గణేష్బాబు పాత్రపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై వేటు వేసింది. ఇదిలా ఉంటే కోడెల ఇంటికి సామగ్రి తరలింపుపై అంతర్గత విచారణ కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm