హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితేౌ గ్రామానికి చెందిన గన్నమని శ్రీనివాసరావు(48) అనే రైతు తనకున్న ఎకరన్నర పొలంతో పాటు అదనంగా మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. ఇటీవల రుణ భారం ఎక్కువ కావడంతో తన పశువుల పాక వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన సంఘటనపై చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm