భద్రాచలం: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు స్వల్ప గాయం అయింది. గురువారం ఉదయం వాకింగ్ చేస్తుండగా కాలు గుంతలో పడటంతో ఒక్కసారిగా ఆయనకు భరించలేని నొప్పి వచ్చింది. దీంతో స్థానిక నాయకులు ఆయనను పట్టణంలోని ఆర్థోపెడిక్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయనకు ఎక్స్రే తీయగా కుడికాలు చిటికెన వేలు వద్ద ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. దీంతో మందకృష్ణకు డాక్టర్ సుదర్శన్ రావు చికిత్స నిర్వహించి మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని, వాకర్ సహాయంతో నడవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm