ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని సిబిఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత నడుమ ఆయన్ను కోర్టుకు తరలించారు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. అంతకుముందు చిదంబరాన్ని మూడు గంటలపాటు సిబిఐ ప్రశ్నించింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. విచారణ నిమిత్తం చిదంబరంను 7 నుంచి 12 రోజుల కస్టడీకీ ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరనున్నట్లు సమాచారం. చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ, చిదంబరం సతీమణి నళినీ చిదంబరం, కుమారుడు కార్తీ కూడా అక్కడికి వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm