హైదరాబాద్ : నగరవాసులకు మరో వెసులుబాటు. జూబ్లీ బస్ స్టఏషన్ నుంచి మెట్రో రైలు సర్వీసులు డిసెంబరు నుంచి అందుబాటులోకి రానున్నాయి. కారిడార్-2 కు సంబంధించి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీబన్ వరకు ఈ సర్వీస్ రాకపోకలు సాగుతాయి. పదిహేను కిలోమీటర్ల ఈ మార్గంలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 9.6 కిలోమీటర్ల మార్గానికి అనుమతులు లభించాయి. మెట్రో రైలుకు నగరవాసుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు తొమ్మిది కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదిలా ఉంటే మెట్రో ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చినపక్షంలో నగరంలో వాహన కాలుష్యానికి కొంతమేర చెక్ పడుతుందని భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm