ముంబై: టీం ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన చివరి వన్డే మ్యాచ్లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో ఒక దశాబ్దంలో 20వేల పరుగులు చేసిన ఏకైక క్రికెటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు. వన్డే మ్యాచ్లలో మొత్తం 43 సెంచరీలు విరాట్ పూర్తి చేయడంతో.. సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ అతిత్వరలో బ్రేక్ చేస్తాడనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే మ్యాచ్లలో సచిన్ పేరుపై ఉన్న 49 సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేయగడమో కానీ.. మాస్టర్ బ్లాస్టర్ పేరిట ఉన్న మరో రికార్డును మాత్రం అతడు బ్రేక్ చేయలేడన్నాడు. 200 టెస్టు మ్యాచ్లు ఆడినట్లు సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సహా ఇతర ఏ క్రికెటర్ బ్రేక్ చేయలేడని తాను నమ్ముతున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా.. టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 77 టెస్టు మ్యాచ్లు ఆడాడు.
Mon Jan 19, 2015 06:51 pm