- 25మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గం ఏకగ్రీవం
ఖమ్మం: భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైరా పట్టణంలోని బోడేపూడి భవన్లో మంగళవారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఎస్.ఎఫ్.ఐ నూతన కమీటిని ప్రతినిధులు నూతన అధ్యక్ష, కార్యదర్శులు జమ్మి అశోక్, చింతల రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా జమ్మి అశోక్, చింతల రమేశ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 25 మందితో కూడిన నూతన జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులుగా బి.హేమంత్, ఎస్.గాయత్రి,వి.మధు,కే.ప్రేమ్ కుమార్ లు, సహాయ కార్యదర్శులుగా టి.ప్రవీణ్,టి.మహేష్, మౌనిక,అక్షిత్ లను ఎన్నుకున్నారు. అప్పటి వరకు ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఉన్న తాళ్ల నాగరాజు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు నూతన కమీటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చింతల రమేష్ నూతన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 11,2019 04:59PM