కొలంబో: ఈ నెలాఖరున ప్రారంభంకావాల్సిన పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాల్సిన జట్టు వివరాలను శ్రీలంక క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకూ పర్యాటక జట్టు మూడు వన్డేలు, మూడు టీ-20లు ఆడనుంది. అయితే ఈ సిరీస్లో పాల్గొనేందుకు నిరాకరించిన.. పది మంది ఆటగాళ్లకు బోర్డు జట్టులో చోటు కల్పించలేదు. పూర్తిస్థాయి యువ ఆటగాళ్లతో శ్రీలంక జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది. వన్డేలకు కెప్టెన్గా లహిరు తిరిమన్నేని, టీ-20లకు కెప్టెన్గా దాసున్ శనకాను నియమించారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని పలువురు శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లమని తేల్చి చెప్పారు. భద్రతా అధికారులు ఎం సర్దిచెప్పినా వాళ్లు సిరీస్లో పాల్గొనేందుకు వాళ్లు అంగీకరించలేదు. దీంతో వాళ్లని పక్కన పెట్టి ఇతర ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన లంకా బోర్డు. వన్డేలు, టీ-20లకు ప్రకటించిన జట్లలో మూడు విభాగాల్లో పటిష్టమైన ఆటగాళ్లకు చోటు కల్పించారు. బ్యాటింగ్ కంటే.. బౌలింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచకప్ తర్వాత బంగ్లాదేశ్ను ఓడించిన జట్టులో ఆల్ రౌండర్లుగా ఉన్న దసున్ శనకాతో పాటు షెహన్ జయసూర్యని జట్టులోకి తీసుకున్నారు.
వన్డే జట్టు వివరాలు : లహిరు తిరుమన్నే(కెప్టెన్), సధీరా సమరవిక్రమా, అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, దసున్ శనకా, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా.
టీ-20 జట్టు: దసున్ శనకా(కెప్టెన్), సధీరా సమరవిక్రమా,అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా, భానుక రాజపక్ష.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 11,2019 05:05PM