న్యూఢిల్లీ : పారిశుద్ధ్యం, మురుగు నీటిని శుభ్రం చేస్తున్న సమయంలో కార్మికులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు చనిపోయేందుకు ప్రపంచంలో ఇంకెక్కడా గ్యాస్ చాంబకు పంపుతున్న దాఖలాలు లేవని బుధవారం వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతూనే ఉందని, ఈ పనులను పరిశీలించిన జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అటువంటి కార్మికులకు మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రం తరుఫు హాజరైన అటార్నీ జనరల్ కెకె వేణు గోపాల్ను ప్రశ్నించింది. సరైన సదుపాయాలు కల్పించక పోవడంతో నెలకు కనీసం ముగ్గురు లేదా నలుగురు కార్మికులు మృత్యువాత పడుతున్నారని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm