హైదరాబాద్: సాధారణ ప్రయాణికుల్లా క్యాబ్ బుక్ చేసుకున్నారు. తాము వెళ్లాల్సిన గమ్యస్థానం చేరుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్పై దాడిచేసి కారు తీసుకొని ఉడాయించారు. అప్పా రేడియల్ రోడ్డులో సినిమా తరహాలో ఈ ఘటన జరిగింది. జియాగూడకు చెందిన యాదయ్య స్కైక్యాబ్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి గచ్చిబౌలి వద్ద ఇద్దరు వ్యక్తులు క్యాబ్ (టిఎస్ 07 యూసి 3715)బుక్ చేసుకున్నారు. వారిని కారులో ఎక్కించుకొని బయలుదేరాడు. అప్పా రేడియల్ రోడ్డులో పీబీఈఎల్సిటీ చౌరస్తా వద్దకు వెళ్లగానే కత్తులతో డ్రైవర్ను బెదిరించారు. అతడిని కిందకు తోసేసి కారుతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పారేడియల్ రోడ్ వద్ద క్యాబ్ను తస్కరించిన నిందితులు ప్రొఫెషనల్స్ అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm