బెంగళూరు: సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఆదివారం జరిగిన చివరి టీ20లో సఫారీలు జూలు విదిల్చి ఘన విజయాన్ని సాధించడంతో సిరీస్ సమంగా ముగిసింది. అయితే దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయిం. ఛేజింగ్కు అనుకూలమైన పిచ్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే మ్యాచ్ తర్వాత కోహ్లి కూడా తమది తప్పుడు నిర్ణయమేనని పరోక్షంగా ఒప్పుకున్నాడు. గేమ్ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడం మాకు అనుకూలించలేదు. కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు మాకు అదే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో మాకు ప్రతికూల ఫలితం వచ్చిందనే విషయాన్ని కూడా కాదనలేం. తదుపరి మ్యాచ్ల్లో దీన్ని పునరావృతం చేయం. పిచ్ను అంచనా వేయడంలో విఫలమయ్యామనే అనుకుంటున్నా. ఇందులో మేము ఇంకా మెరుగవ్వాలి అని కోహ్లి పేర్కొన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm