ముంబయి: మార్కెట్లోకి కేటీఎం ఇండియా సరికొత్త బైక్ను విడుదల చేసింది. ఆల్న్యూ 790 డ్యూక్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాహనం ధర రూ.8.63లక్షలుగా నిర్ణయించారు. పూర్తిగా సీకేడీ మార్గంలో ఈ బైక్ విడిభాగాలను భారత్కు తీసుకొచ్చి అసెంబుల్ చేస్తారు. ఈ బైకు ట్రయాంఫ్ స్ట్రీట్, యమహా ఎంటీ 09, కవాసకీ జెడ్900, డుకాటీ మాన్స్టర్ 821 బైకులకు పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త వాహనంలో సింగల్ పీస్ అల్యూమినియం ఫ్రేమ్ను అమర్చారు. దీంతో బైకు బరువు గణనీయంగా తగ్గిపోయింది. ఇక డిజైన్ విషయంలో కేటీఎం సంప్రదాయలు మొత్తం దీనిలో కనిపిస్తాయి. షార్ప్ ఫ్యూయల్ ట్యాంక్, ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్లు, స్ప్లిట్ సీట్లు వంటి ఆకర్షణలు ఉన్నాయి. దీనిలో 799 సీసీ పార్లల్ట్విన్ మోటార్ ఇంజిన్ అమర్చారు. ఇది 103 బీహెచ్పీ శక్తిని 87 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. ఈ బైకు 189 కిలో బరువు ఉంది. వెయిట్ టు పవర్ నిష్పత్తి ప్రతి టన్నుకు 612 బీహెచ్పీ వరకు ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఇదే అత్యుత్తమం.
Mon Jan 19, 2015 06:51 pm