హైదరాబాద్ : యూసుఫ్గూడ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. విద్యుత్ మీటర్ బిగించేందుకు ఏఈ సుధాకర్.. ఓ వ్యక్తి నుంచి రూ. 60 వేలు డిమాండ్ చేశాడు. మొదటి విడుతగా రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా సుధాకర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm