ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ కష్టాల నుంచి బయటపడలేదు. నేడు మార్కెట్ భారీగా ర్యాలీ చేస్తున్నా ఈ స్టాక్ మాత్రం 9శాతం విలువ కోల్పోయింది. ఫలితంగా 20ఏళ్ల అత్యల్పధర వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ క్యాపిటల్కు చెందిన రూ.17వేల కోట్లు విలువైన రుణాలకు సంబంధించి సోమవారం కేర్ రేటింగ్ ఏజెన్సీ డి-రేటింగ్ ఇచ్చింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించిన సమస్యలు ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ఆ షేరు 1999 మార్చి 19 నాడు ట్రేడైన స్థాయికి పడిపోయింది. నాన్కన్వర్టుబుల్ డిబెంచర్లకు సంబంధించిన కూపన్లను ఒక రోజు తేడాతో చెల్లించారు. ప్రస్తుతం కంపెనీకి నగదు సమస్యలు ఉన్నాయి. ఆస్తులను విక్రయించి నగదు సమీకరించడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రుణ చెల్లింపుల్లో ఆలస్యం అవుతోంది అని కేర్ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. మధ్యాహ్నానం 3 సమయంలో ఈ షేరు రూ.28.80 వద్ద ట్రేడవుతోంది. నేడు ఒకదశలో రూ. 27.75 స్థాయిని తాకింది.
Mon Jan 19, 2015 06:51 pm