సిద్దిపేట: ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటను ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మారుద్దామని పిలుపునిచ్చారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని హరీష్ రావు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఐటీసీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పాఠశాలలో చెత్తసేకరణ చేసిన పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. ఐటీసీ కంపెనీ స్వచ్ఛత హి సేవ ర్యాలీని మొట్టమొదట సిద్దిపేటలో ప్రారంభించడం చాలా సంతోషం అని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ర్యాలీ నిర్వహించడం హర్షణీయం అన్నారు. 'గతంలో మహాత్మా గాంధీ స్వచ్ఛ గ్రామాల మీద మాట్లాడారు కాబట్టే నేడు.. మనము దానిని అమలు చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm