మహబూబాబాద్ : కురవి మండలం మోదుగులగూడెంలో విషాదం నెలకొంది. పంట పొలంలో పనులు చేసుకుంటున్న మంద నర్సమ్మ(45) పిడుగుపాటుకు మృతి చెందింది. పిడుగు పడ్డ శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకుని నర్సమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm