న్యూఢిల్లీ: అక్రమ మద్యం దుకాణాలపై ఆప్ సర్కార్ కొరడా ఝళిపించింది. డిపార్ట్మెంట్ స్టోర్స్ ముసుగులో మద్యం అమ్ముతున్న అక్రమ లిక్కర్ దుకాణాలపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారంనాడు మెరుపు దాడులు చేపట్టారు. ఎక్సైజ్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో లిక్కర్ నిల్వలు పెద్దఎత్తున ఉండటాన్ని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా, గత 2016 ఆగస్టు నుంచి దేశ రాజధానిలో కొత్తగా లిక్కర్ దుకాణాలేవీ తెరుచుకోలేదని ఇటీవల అసెంబ్లీలో సిసోడియా తెలిపారు. అయినప్పటికీ 2016-17 నుంచి ఆల్కహాల్పై ఆదాయం రూ.780 కోట్లకు పెరిగిందన్నారు. 2015 నుంచి 2019 వరకూ పెరిగిన లిక్కర్ దుకాణాలు 133 మాత్రమేనని, అయితే 2016 ఆగస్టు తర్వాత కొత్తగా ఒక్క లిక్కర్ దుకాణం కూడా తెరుచుకోలేదని అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా సిసోడియా తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm