హైదరాబాద్: హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందని, ఉత్తమ్ కుయుక్తులు ఇక ఎంతమాత్రం చెల్లవని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో జగదీష్ రెడ్డి ప్రసంగించారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఉత్తమ్కు సరైన బుద్ది చెప్పి.. కాంగ్రెస్ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కుట్రలు చేసి గెలిచిన ఉత్తమ్కు ఈసారి గుణపాఠం చెప్పాలని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm