హైదరాబాద్: డెంగీ లక్షణాలతో యువతి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఉరవకొండ మండల పరిధిలోని నెరమెట్ల గ్రామానికి చెందిన గోపాల్, సుహాసినీల కుమార్తె శాంతికుమారి (19). కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మూడు రోజుల క్రితం జ్వరం ఎక్కువగా రావడంతో అనంతపురానికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి డెంగీ జ్వరం అని తెలపడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం మృతి చెందింది.
Mon Jan 19, 2015 06:51 pm