హైదరాబాద్: విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లింది. ఏజెన్సీలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే జీకే వీధి మండలం పేములగొంది దగ్గర పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm