విజయవాడ: గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధిపై ఎంపీ కేశినేని నాని సంచలన కామెంట్స్ చేశాడు. గడిచిన 104 రోజుల జగన్ పాలనలో ఎయిర్ పోర్టు అభివృద్ధి కుంటుపడిందని భగ్గుమన్నారు. ప్రభుత్వ విధానాలతో ఎయిర్ పోర్టు సర్వీసులు ఆగిపోయాయని విమర్శించారు. గత ఐదేళ్లలో ఎయిర్ పోర్టు ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అంతర్జాతీయ, జాతీయ కొత్త సర్వీసులను తీసుకువచ్చామని నాని వివరించారు. కానీ, జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అంతా నీరుగార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధిపై దృష్టి సారించి వయోబులిటి ఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన సర్వీసులను పునరుద్ధరించాలన్నారు. ఎయిర్ పోర్టు అభివృద్ధితో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ తర్వగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఎంపీ నాని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm