గుంటూరు: నెల్లూరు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పంచాయతీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి ఎందుకని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ హోదాలో ఉన్న సుబ్బారెడ్డి నివాసంలో నెల్లూరు పంచాయితి ఎలా నిర్వహిస్తారు?, ఒక దేవాలయానికి ఛైర్మన్గా ఉన్న వ్యక్తికి రాజకీయ పంచాయితి చేయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. కోటంరెడ్డిపై ప్రభుత్వం సరిగా వ్యవహరిస్తే ఈరోజు జైల్లో ఉండాలని, ఆ వ్యవహారంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహరించిందన్నారు. సీఎం జగన్కు నైతిక విలువలు ఉంటే శ్రీధర్రెడ్డిని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm