కృష్ణా: కృష్ణా జిల్లా నుంచి ఒడిసాకు అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలంలోని కోరుకొల్లు సీబీ కెనాల్ వంతెన సమీపంలోని ఓ షెడ్డు నుంచి తాబేళ్లను రెండు ఆటోల్లో తరలించడానికి సిద్ధం చేస్తుండగా పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి సేకరించిన తాబేళ్లను షెడ్డు వద్దకు తరలిస్తున్న రెండు ఆటోలు, మూడు మోటారు సైకిళ్లు, 8 క్వింటాళ్ల తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm