న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు 40 రోజుల పాటు సాగించిన రోజువారీ విచారణ బుధవారంతో ముగిసింది. తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నవంబర్ 17వ తేదీకి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో సంబంధిత పార్టీలు లిఖిత పూర్వక నివేదనలు అందజేసేందుకు సుప్రీం ధర్మాసనం మరో మూడు రోజుల గడువు ఇచ్చింది. అయోధ్య కేసులో బుధవారంనాడు విచారణ సందర్భంగా, ఈ కేసుకు ముగింపు పలకనున్నట్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm