హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం కూల్చివేత పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఈనెల 21వతేదీకి వాయిదా పడింది. సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ప్రస్తుత భవనాలు మరమ్మతులు చేయలేని స్థితిలో ఉన్నట్లు కమిటీ చెప్పిందని ప్రభుత్వం తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్ -బ్లాక్ ను కూల్చాల్సిన అవసరమేంటని హైకోర్టు అడిగింది. నూతన సచివాలయం విస్తీర్ణం, నమూనా వివరాలు హైకోర్టు అడిగింది.
Mon Jan 19, 2015 06:51 pm