న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో తనకు సంబంధాలున్నాయంటూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఏఐ చేస్తున్న వాదనను వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ తోసిపుచ్చారు. తనపై మూడేళ్ల పాటు విచారణ జరిపిన తర్వాత కూడా ఎన్ఐఏ ఈ తరహాలో మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. తమ వాదనలకు బలం చేకూర్చే ఒక్క సాక్ష్యం కూడా ఎన్ఐఏ వద్ద లేదని ఓ వార్తా సంస్థకు ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన 127 మందిలో ఎక్కువ మంది ఐఎస్ఐఎస్ సానుభూతిపరులేనని ఎన్ఐఏ చెబుతోంది. వీరంతా ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలకు ప్రభావితమైన వారేనని కుండబద్ధలు కొట్టింది. 2014 నుంచి 28 కేసుల్లో 127 మందిని ఎన్ఐఏ అరెస్టు చేయగా, వీరిలో తమిళనాడు నుంచి 33 మంది, యూపీలో 19, కేరళలో 17, తెలంగాణలో 14, మహారాష్ట్రలో 12, కర్ణాటకలో 8, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్లో ఒకరు, పశ్చిమబెంగాలో ఒకరు, జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉన్నారని ఎన్ఐఏ గణాంకాలు చెబుతున్నాయి. జకీర్ నాయక్పైన, ఆయన సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎస్)పైన ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అయితే, జకీర్ నాయక్ పరారీలో ఉండటం, మలేసియాలో నివాసం ఏర్పరచుకోవడంతో ఇంతవరకూ ఆయనను ఈ కేసులో ఎన్ఐఏ విచారించలేకపోయింది. ఆయనను తమకు అప్పగించాలంటూ ఎన్ఐఏ ఇప్పటికే మలేసియా ప్రభుత్వాన్ని కోరగా, ప్రస్తుతం ఆ విజ్ఞాపన పెండింగ్లో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 05:16PM