న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్తలు దేశ ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా, తమ సంస్థల ద్వారా చేస్తున్న కృషి ఆధారంగా దాతల జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. గతంలో ఆయన రెండో స్థానంలో ఉండేవారు, తాజా ర్యాంకుల ప్రకారం అజీం ప్రేమ్జీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఎడెల్గివ్ ఫౌండేషన్, హురున్ ఇండియా తమ 6వ ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ 2019ను విడుదల చేసింది. వ్యక్తిగతంగా, కార్పొరేట్ సంస్థల పరంగా సంవత్సరానికి రూ.5 కోట్లకు మించి విరాళాలు ఇచ్చినవారితో ఈ జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో శివ్ నాడార్, రెండో స్థానంలో అజీం ప్రేమ్జీ, మూడో స్థానంలో ముఖేశ్ అంబానీ నిలిచారు. మొత్తం 100 మందితో ఈ జాబితాను రూపొందించారు.
Mon Jan 19, 2015 06:51 pm