జన్నారం రూరల్ : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా టిఎస్యు జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులు జన్నారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm