అమరావతి: ఏపీ సీఎం జగన్తో హాంకాంగ్కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాదరక్షల తయారీకి ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో రూ.700 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఆసక్తి చూపింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు 10వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని సీఎంకు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. తొలివిడతో రూ.350 కోట్లతో ఫుట్వేర్ యూనిట్ ఏర్పాటు చేస్తామని.. విస్తరణ ద్వారా మరో రూ.350 కోట్ల పెట్టుబడి పెడతామని ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ చర్చల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm