హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. కార్మికులను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, కేసీఆర్కు భయపడే ఆర్టీసీ సమ్మెపై చర్చల విషయంలో కేశవరావు మాటమార్చారని ఆరోపించారు. తెరాసలో ఎంత నియంతృత్వం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. హుజూర్నగర్ ఎన్నికల్లో ఓడిపోతేనే తమకు విలువ ఉంటుందని తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారని వీహెచ్ వెల్లడించారు. యురేనియం తవ్వకాల నిషేధంపై కేసీఆర్కు చిత్తశుద్దిలేదని ఆక్షేపించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఇంకెన్ని రోజులు కేసీఆర్ ప్రజలను మోసం చేస్తారని వీహచ్ నిలదీశారు.
Mon Jan 19, 2015 06:51 pm