హైదరాబాద్ : టీవీ 9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో మాజీ సీఈవో రవి ప్రకాశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని తనపై నమోదు చేసిన కేసులు, ఎఫ్ఐఆర్ లను కొట్టి వేయాలని రవి ప్రకాశ్ కోర్టును అభ్యర్థించారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణను నవంబర్ 2కు వాయిదా వేస్తూ అప్పటివరకు రవి ప్రకాశ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
ప్రస్తుతం రవి ప్రకాశ్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రవి ప్రకాశ్ ను ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలని బంజారా హిల్స్ పోలీసులు కోరగా కోర్టు అందుకు తిరస్కరించింది. మరోవైపు రవిప్రకాశ్ తనకు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేసుకోగా దానిపై విచారణ జరగాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 09:56PM