హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో 725 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానించి తనిఖీ చేశారు. అతని వద్ద నుంచి నల్లటి టేపు చుట్టి కోడిగుడ్డు ఆకారంలో ఉన్న 3 ఉండలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 832 గ్రాముల బరువున్న బంగారం ఉండలను స్వాధీనం చేసుకుని కరిగించారు. వాటిలో వృథా అంతా పోనూ రూ.27.87 లక్షల విలువైన 725 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు అంచనావేశారు.
Mon Jan 19, 2015 06:51 pm