హైదరాబాద్: చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలు బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు ఇష్టపడరు. మరి కొందరు ఆలస్యంగానైనా వెల్లడిస్తారు.తాజాగా మహానటి సినిమా నిర్మాత స్వప్న దత్ తన ముద్దుల కూతురును పరిచయం చేస్తూ ఇన్స్టా గ్రామ్లో ఫోటోను షేర్చేసింది. 2018 సంవత్సరంలో 66వ జాతీయ పురస్కారాల్లో మహానటి సినిమాకు మూడు అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం నిర్మించిన ఇద్దరు నిర్మాతల్లో ఒకరైన స్వప్పదత్కు ప్రశంసల వర్షం కురిసింది. 2010, డిసెంబర్లో ప్రసాద్వర్మను వివాహం చేసుకున్న స్వప్న దత్ ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాకు నవ్య వైజయంతి వేటుకూరి అని పేరు పెట్టినట్టు తెలిపింది. స్వప్నదత్ గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం, సుభాష్చంద్రబోస్ చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించింది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెనే స్వప్నదత్.
Mon Jan 19, 2015 06:51 pm