హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి దయారుగూడలో రాజా అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు అతను సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు పంపినట్టు సమాచారం. జీవితంలో విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాజా వీడియోలో తెలిపాడు. రాజా ఏసీ మెకానిక్ గా పని చేస్తున్నాడు. అతను తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వాసి అని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm