హైదరాబాద్: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీసుల కథనం ప్రకారం.. మార్కెట్ చాపల బావికి చెందిన వెంకటేశ్(48) అలియాస్ మిట్టు ఈనెల 16వ తేదీన బోయినపల్లి డైమండ్ పాయింట్లో ఉంటున్న స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. అలాగే కుమ్మరిగూడకు చెందిన సురేశ్ మిర్వాని(29)గచ్చిబౌలిలో టైల్స్ అండ్ స్టోర్స్ సంస్థలో స్టోర్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈనెల 14వ తేదీన బంధువుల ఇంటికని వెళ్లి కనిపించకుండా పోయాడు. మరో ఘటనలో మారుతి వీధికి చెందిన నారాయణదాస్ చందక్(50) అప్పులు ఎక్కువ కావడంతో ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆదివారం మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm