హైదరాబాద్: అప్పుల బాధతో ఓ వ్యక్తి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్ఐ కె.చంద్రమోహన్ తెలిపిన ప్రకారం..గుజరాతి గల్లీ కందస్వామి లేన్లో నివాసం ఉండే ఊడమర్రి భరత్కుమార్(26) ఫుడ్ డెలివరీ బాయ్. కాగా, ఇటీవల ఆ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఆదివారం ఉదయం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. 95శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఉస్మానియా దవాఖానకు తరలించారు. భరత్కుమార్ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm