హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత షబ్బీర్అలీని పొలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తాజాగా వరంగల్లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి గృహ నిర్బంధం చేశారు. వర్ధన్నపేటలోనూ కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మహబూబాబాద్, ఎల్బీనగర్లో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రగతి భవన్ ముట్టడికి హాజరవుతున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm