ముంబై: ఓటింగ్ సమయంలో ఓ బీఎస్పీ నేత ఈవీఎంపై సిరా చల్లిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన సునీల్ ఖాంబే అనే బీఎస్పీ నేత ఈవీఎంపై ఇంక్ చల్లారు. అంతేకాకుండా ఈవీఎం ముర్దాబాద్, ఈవీఎం నహీ చలేగా అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు
Mon Jan 19, 2015 06:51 pm