సూర్యాపేట: పనిఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం అలుగునూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన ఉపాధ్యాయుడు పట్టేటి విద్యాసాగర్ అలుగునూరు సాంఘిక సంక్షేమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పనిఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mon Jan 19, 2015 06:51 pm