హైదరాబాద్: ఆర్టీసీని రక్షించుకోవడానికి ఏ ఉద్యమానికైనా సిద్ధమని టీజేఎంయూ నేత హన్మంతు స్పష్టం చేశారు. రోజు రోజుకు సమస్యను సీఎం కేసీఆర్ జఠిలం చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చాక ఒక్క డిపో పెరగలేదని, ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేయడానికి చూస్తున్నారని, కార్మికుల సమస్యలనే యూనియన్లు ప్రస్తావిస్తున్నాయన్నారు. విలీనం చేస్తామన్న ప్రభుత్వం మాట నిలుపుకోవాలని, మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఏపీ సీఎం ఆర్టీసీని విలీనం చేశారని చెప్పారు. తనను ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారని, జీతాలు ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారని హన్మంతు ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm