హైదరాబాద్: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, యనమల మాట్లాడే మాటల్లో నిజం లేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతలు బాధ్యతారహితంగా మాట్లాడటం శోచనీయమన్నారు. రైతు భరోసాను ఏడాది ముందే అమలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తున్నామని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm