హైదరాబాద్: పాతికేళ్ల కెరీర్లో తీసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినిమాపై కృష్ణవంశీ వేసిన మార్క్ సామాన్యమైనది కాదు. కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న కృష్ణ వంశీ ఇప్పుడు ఓ రీమేక్ సినిమాతో ముందుకొస్తున్నాడు. ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తోంది.
2016లో మరాఠీ భాషలో హిట్ అయిన నట సామ్రాట్ అనే సినిమాను రంగమార్తాండ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో కృష్ణ వంశీ మళ్లీ తన మార్క్ చూపంచాలని తపిస్తున్నాడు. ఇందులో భాగంగా స్క్రిప్ట్ విషయంలో టాలీవుడ్ సీనియర్ అండ్ టాప్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ సాయం తీసుకుంటున్నాడని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మరాఠీ కథను తెలుగుకు తగ్గట్టు మార్పులు చేసి ఇవ్వాలని వారిని కోరినట్టు అందుకు పరుచూరి సోదరులు అంగీకరించి స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కృష్ణవంశీ స్పందించాడు. రంగమార్తాండకు పరుచూరి సోదరులు కథను డెవలెప్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్వయంగా కృష్ణవంశీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2019 11:13PM