న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధ విమానాలు మరిన్నింటిని సమకూర్చుకొనేందుకు భారత వైమానిక దళం-హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మధ్య ఒప్పందం దాదాఫు ఖరారైనట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. మరో 83 తేజస్ విమానాలు కొనుగోలు చేయాలని 2017 డిసెంబరులో హాల్కు ఎయిర్ఫోర్స్ సింగిల్ వెండర్ టెండర్ను జారీ చేసింది. అయితే, విమాన ధర విషయంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.విమానం ధరల విషయంలో నియమించిన ప్రత్యేక కమిటీ జరుపుతున్న చర్చలు దాదాపు పూర్తికావచ్చాయి. వెంటనే ఎయిర్ఫోర్స్-హాల్ మధ్య ఒప్పందం కుదరనుంది అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మార్క్ 1ఏ రకానికి చెందిన 83 తేజస్ విమానాల ఒప్పందం విలువ రూ.45 వేల కోట్ల వరకూ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm