అమరావతి: మాజీ సిఎస్ ఐవైఆర్ సిఎస్ బదిలీపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సిఎస్ పదవిలో ఉన్నవారిని రెండేళ్లు కొనసాగించాలని, క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర హోం కార్యదర్శి, డీజీపీల మాదిరే సిఎస్ కూడా రెండేళ్లు పదవిలో ఉండేలా ఆదేశాలివ్వాలని కోరారు. తాజగా ఏపీ సిఎస్ బదిలీ విషయాన్ని కూడా పిల్ లో ప్రస్తావించిన ఐవైఆర్ ప్రతివాదులుగా ఇంచార్జ్ సిఎస్, జీఏడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, డీఓపీటీ కార్యదర్శులును చేర్చారు. వచ్చే వారం ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm