మాల్: డిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కడారి జంగయ్య(40)కు మతిస్థిమితం లేకపోవడంతో భార్య సంతోష తో పాటు బంధువులు అతడిని చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలోని అబ్బాస్ దర్గా వద్దకు తీసుకొచ్చారు. రాత్రి దర్గా వద్ద నిద్రచేస్తుండగా జంగయ్య గ్రామంలోకి వెళ్లాడు. దీంతో దొంగగా భావించిన గ్రామస్తులు ఓ ఇంట్లోకి వెళ్లిన జంగయ్యపై విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఇబ్రహీంపట్నం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm