ముంబై: ఈనెల 24న చేపట్టదలచిన అయోధ్య పర్యటనను శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల రీత్యానే ఉద్ధవ్ తన పర్యటన రద్దు చేసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయోధ్యలో భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో ఉద్ధవ్ పర్యటనకు భద్రతా సంస్థల నుంచి అనుమతి లభించలేదని, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యం కూడా ఉద్ధవ్ పర్యటన రద్దుకు ఒక కారణమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm