పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్డులోని ఓ బిల్డింగ్ పైకెక్కి వ్యక్తి హల్చల్ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. తాతారావు అనే వ్యక్తి భవనం పైకెక్కి పక్కనే ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వైర్లపై కర్రను వేసి ఎక్కడానికి ప్రయత్నించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అల్లు దుర్గారావు సమయస్ఫూర్తి తో వ్యవహరించి విద్యుత్ను నిలుపుదల చేయించి పైకిఎక్కిన వ్యక్తిని పట్టుకొని కిందికి దించారు. భవనం పైకి ఎక్కిన వ్యక్తికి మతి స్థిమితం లేనట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm