హైదరాబాద్: విపక్షాలపై దాడులు మానేయండి.. ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేయండి.. మాకు న్యాయం చేయండంటూ ఇవాళ పార్లమెంట్లో ప్రతిపక్షాలు పార్టీలు డిమాండ్ చేశాయి. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫారూక్ అబ్దుల్లాను హౌజ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడారు. ఫారూక్ అబ్దుల్లాను అరెస్టు చేసి 108 రోజులు అయ్యిందన్నారు. ఇక్కడేం రాజ్యం నడుస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆయన్ను పార్లమెంట్కు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అది ఆయన రాజ్యాంగ హక్కు అని అధిర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రాలకు ఎస్పీజీ భద్రతను ఎత్తివేయడాన్ని కూడా అధిర్ ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm