పాట్నా : బీహార్ గోపాల్గంజ్ జిల్లాలోని సరేయా నరేంద్ర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓవర్లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పింది. దీంతో ట్రాక్టర్ పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత చిన్నారులంతా పదేళ్ల వయసున్న వారే. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ తప్పించుకున్నాడు. జిల్లా ఎస్పీతో పాటు పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm